శ్రావణ మాసపు తొలి శుక్రవారం శుభాకాంక్షలు
కనకధారా స్తోత్రం:
సాధారణంగా శుక్రవారాన్ని ఎంతగానో ఇష్టపడే లక్ష్మీదేవి, శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజుని మరింత ఇష్టపడుతుంది. వేంకటేశ్వరస్వామిది 'శ్రవణా నక్షత్రం' ... అందువలన ఈ మాసం అంటే అమ్మవారు ప్రత్యేకమైన అభిమానాన్ని చూపెడుతుంది. ఈ శ్రావణ మాసపు శుక్రవారం రోజున మహాలక్ష్మిని ఆరాధించడం వలన సకల సంపదలు లభిస్తాయని చెబుతారు. అదే విధంగా గోలక్ష్మి (ఆవు)ని పూజించిన వారికి సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని అంటారు. ఈ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి ... 'కనకధారా స్తోత్రం' చదువుకున్నట్టయితే, సిరిసంపదలు కలుగుతాయి
సాధారణంగా శుక్రవారాన్ని ఎంతగానో ఇష్టపడే లక్ష్మీదేవి, శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజుని మరింత ఇష్టపడుతుంది. వేంకటేశ్వరస్వామిది 'శ్రవణా నక్షత్రం' ... అందువలన ఈ మాసం అంటే అమ్మవారు ప్రత్యేకమైన అభిమానాన్ని చూపెడుతుంది. ఈ శ్రావణ మాసపు శుక్రవారం రోజున మహాలక్ష్మిని ఆరాధించడం వలన సకల సంపదలు లభిస్తాయని చెబుతారు. అదే విధంగా గోలక్ష్మి (ఆవు)ని పూజించిన వారికి సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని అంటారు. ఈ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి ... 'కనకధారా స్తోత్రం' చదువుకున్నట్టయితే, సిరిసంపదలు కలుగుతాయి
శ్లో1!! అంగం హరే: పులక భూషణ మాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ !
అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా
మాంగల్యదా౭స్తు మమ మంగళదేవతాయా: !!
తా : ఆడ తుమ్మెద నల్లని తమాల వృక్షముపై వాలినట్లుగా ఏ మంగళదేవత యొక్క
ఓరచూపు నీలమేఘశ్యాముడైన భగవాన్ విష్ణుమూర్తిపై ప్రసరించినప్పుడు ఆ
వృక్షము తొడిగిన మొగ్గలవలె ఆయన శరీరముపై పులకాంకురములు పొడమినవో,
అష్టసిద్ధులను వశీకరించుకొన్న ఆ శ్రీ మహాలక్ష్మీ భగవతి యొక్క కృపా
కటాక్షము నాకు సమస్త సన్మంగళములను సంతరించును గాక !
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ !
అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా
మాంగల్యదా౭స్తు మమ మంగళదేవతాయా: !!
తా : ఆడ తుమ్మెద నల్లని తమాల వృక్షముపై వాలినట్లుగా ఏ మంగళదేవత యొక్క
ఓరచూపు నీలమేఘశ్యాముడైన భగవాన్ విష్ణుమూర్తిపై ప్రసరించినప్పుడు ఆ
వృక్షము తొడిగిన మొగ్గలవలె ఆయన శరీరముపై పులకాంకురములు పొడమినవో,
అష్టసిద్ధులను వశీకరించుకొన్న ఆ శ్రీ మహాలక్ష్మీ భగవతి యొక్క కృపా
కటాక్షము నాకు సమస్త సన్మంగళములను సంతరించును గాక !
శంకరులు ఇక్కడ ముందుగా విష్ణుభగవానుని నామాన్ని చెప్పి తల్లి
లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు చేసిన మొట్టమొదటి శ్లోకం ఇది.
తల్లి నిత్యానపాయని కదా విష్ణువుని కీర్తిస్తే తాను ఎక్కువ సంతోష
పడుతుంది. ఇందులో శంకరులు హరేః అన్న నామాన్ని ప్రస్తావించారు. వేరు
నామాల్ని ఏవీ ప్రస్తావించలేదు. హరి అంటే సకల పాపాలను హరించేవాడు అని కదా
అర్థం. ఒకవేళ బీద బ్రాహ్మణి పాపాలు ఎక్కువగా ఉంటే వాటిని తేలికగా
తీసేయగలిగినవాడు శ్రీ హరి. అందుకు ఈ నామం వాడారు.
లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు చేసిన మొట్టమొదటి శ్లోకం ఇది.
తల్లి నిత్యానపాయని కదా విష్ణువుని కీర్తిస్తే తాను ఎక్కువ సంతోష
పడుతుంది. ఇందులో శంకరులు హరేః అన్న నామాన్ని ప్రస్తావించారు. వేరు
నామాల్ని ఏవీ ప్రస్తావించలేదు. హరి అంటే సకల పాపాలను హరించేవాడు అని కదా
అర్థం. ఒకవేళ బీద బ్రాహ్మణి పాపాలు ఎక్కువగా ఉంటే వాటిని తేలికగా
తీసేయగలిగినవాడు శ్రీ హరి. అందుకు ఈ నామం వాడారు.
అలాగే తమాల వృక్షం అన్న పదాన్ని వాడారు. తమాల వృక్షాన్ని చీకటి చెట్టు
అని అంటారు అది నల్లగా ఉంటుంది. ఊరి బయట సముద్రపుటొడ్డున స్మశానాలలో
ఉంటుంది. అందరూ వదిలేసి వెళ్ళినా స్మశానంలో నేనున్నాని చెప్పి
పాపపుణ్యాలకతీతంగా జీవునికి తోడుగా స్మశానంలో ఉండేది తమాల వృక్షం. మరి
అలాంటి నీలమేఘ సంకాశుడైన విష్ణుభగవానుడు కూడా అంతేగా పాపపుణ్య ఫలప్రదాత/
పాపపుణ్యాలకతీతంగా జీవులని ఉద్దరించగలడు. అలాగే ఈ బీద బ్రాహ్మణ
కుటుంబాన్ని కూడా పాపపుణ్యాలకతీతంగా ఉద్దరించగలడు.
అంతటి గొప్ప కారుణ్యాన్ని వర్షించగల విష్ణుభగవానుడు నీ చూపులు తగిలేసరికి
అతని శరీరము పులకాంకితమౌతుంది. తమాల వృక్షానికున్న బొడిపెలలాంటి
మొగ్గలమీద ఆడ తుమ్మెద ఎలాతిరుగుతున్నదో అలా నీచూపులు కారుణ్యపూర్తమైన
విష్ణుభగవానుని శరీరము మీద సోకేసరికి శ్రీహరికి పులకాంకురాలు కలిగి అవే
ఆభరణాలుగా మారాయి.
అని అంటారు అది నల్లగా ఉంటుంది. ఊరి బయట సముద్రపుటొడ్డున స్మశానాలలో
ఉంటుంది. అందరూ వదిలేసి వెళ్ళినా స్మశానంలో నేనున్నాని చెప్పి
పాపపుణ్యాలకతీతంగా జీవునికి తోడుగా స్మశానంలో ఉండేది తమాల వృక్షం. మరి
అలాంటి నీలమేఘ సంకాశుడైన విష్ణుభగవానుడు కూడా అంతేగా పాపపుణ్య ఫలప్రదాత/
పాపపుణ్యాలకతీతంగా జీవులని ఉద్దరించగలడు. అలాగే ఈ బీద బ్రాహ్మణ
కుటుంబాన్ని కూడా పాపపుణ్యాలకతీతంగా ఉద్దరించగలడు.
అంతటి గొప్ప కారుణ్యాన్ని వర్షించగల విష్ణుభగవానుడు నీ చూపులు తగిలేసరికి
అతని శరీరము పులకాంకితమౌతుంది. తమాల వృక్షానికున్న బొడిపెలలాంటి
మొగ్గలమీద ఆడ తుమ్మెద ఎలాతిరుగుతున్నదో అలా నీచూపులు కారుణ్యపూర్తమైన
విష్ణుభగవానుని శరీరము మీద సోకేసరికి శ్రీహరికి పులకాంకురాలు కలిగి అవే
ఆభరణాలుగా మారాయి.
నీచూపులను అంగీకరించిన విష్ణువుయొక్క మహదానందమునకు కారణమై అఖిల విభూతులకూ
సకలైశ్వర్యములకూ పుట్టినిల్లువైన తల్లీ లక్ష్మీ దేవీ! ఆ చల్లని చూపులు
ఒకసారి మావంక ప్రసరింపజేస్తే విష్ణు భగవానుడు అనునయంగా మా పాపాలను తొలగ
తోస్తాడు తద్వారా నీవు మాకు సమస్త మంగళములు కల్గించెదవుగాక !
సకలైశ్వర్యములకూ పుట్టినిల్లువైన తల్లీ లక్ష్మీ దేవీ! ఆ చల్లని చూపులు
ఒకసారి మావంక ప్రసరింపజేస్తే విష్ణు భగవానుడు అనునయంగా మా పాపాలను తొలగ
తోస్తాడు తద్వారా నీవు మాకు సమస్త మంగళములు కల్గించెదవుగాక !
(సందర్భానుసారం: తల్లీ! పాపాలెన్నో కలిగి పుణ్యరాశిలేని ఈ బీదబ్రాహ్మణ
కుటుంబ పాపాలను తొలగతోయగలిగిన శక్తిఉన్న దంపతులు మీరు, ఏకాదశి వ్రతం చేసి
ద్వాదశి పారణకై వేచి ఉన్నారంటే ఆ శ్రీ హరిని పూజించువారేకదా, దానిద్వారా
వారి పాపాలను ధ్వంసం చేయడం మీకు సాధ్యమే. ఇక పుణ్యం విషయానికి వస్తే
ఇదిగో ఇప్పుడే నాచేతిలో ఉసిరికాయ దానం చేసింది, ఆ కొంత పుణ్యాన్ని కొండంత
పుణ్యంగా మార్చే కరుణామూర్తులు మీరు, అది అడ్డం పెట్టి ఈ బ్రాహ్మణ
కుటుంబానికి సంపత్తిని కలుగజేసి దారిద్ర ధ్వంసనం చేయి)
కుటుంబ పాపాలను తొలగతోయగలిగిన శక్తిఉన్న దంపతులు మీరు, ఏకాదశి వ్రతం చేసి
ద్వాదశి పారణకై వేచి ఉన్నారంటే ఆ శ్రీ హరిని పూజించువారేకదా, దానిద్వారా
వారి పాపాలను ధ్వంసం చేయడం మీకు సాధ్యమే. ఇక పుణ్యం విషయానికి వస్తే
ఇదిగో ఇప్పుడే నాచేతిలో ఉసిరికాయ దానం చేసింది, ఆ కొంత పుణ్యాన్ని కొండంత
పుణ్యంగా మార్చే కరుణామూర్తులు మీరు, అది అడ్డం పెట్టి ఈ బ్రాహ్మణ
కుటుంబానికి సంపత్తిని కలుగజేసి దారిద్ర ధ్వంసనం చేయి)
శ్లో2!! ముగ్ధా ముహుర్ విదధతీ వదనే మురారే:
ప్రేమ ప్రపాత ప్రణిహితాని గతాగతాని !
మాలా దృశోర్ మధుకరీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగర సంభవాయా: !!
తా : ఒక పెద్ద కమలము చుట్టుత ఆగి-ఆగి పరిభ్రమించు తుమ్మెద వలె
విష్ణుమూర్తి యొక్క మోముపై వెల్లువలెత్తిన ప్రేమను మాటిమాటికిని
ప్రసరింపజేయు శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్ష పరంపర నాకు సంపదల ననుగ్రహించు
గాక !
ప్రేమ ప్రపాత ప్రణిహితాని గతాగతాని !
మాలా దృశోర్ మధుకరీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగర సంభవాయా: !!
తా : ఒక పెద్ద కమలము చుట్టుత ఆగి-ఆగి పరిభ్రమించు తుమ్మెద వలె
విష్ణుమూర్తి యొక్క మోముపై వెల్లువలెత్తిన ప్రేమను మాటిమాటికిని
ప్రసరింపజేయు శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్ష పరంపర నాకు సంపదల ననుగ్రహించు
గాక !
ఈ శ్లోకంలో విష్ణు భగవానుని "మురారేః" అని సంబోధించారు బాల శంకరులు.
మురారి అంటే ముర అనే రాక్షసుని చంపినవాడు లేదా శత్రువు అని అర్థం.
మురాసురుడు బ్రహ్మగారి కొరకై తపస్సు చేసి లోకాలన్నీ జయించటంకొరకు తాను
ఎవరినైతే ముట్టు కుంటాడో వారు మరణించేటట్టు వరం ఇవ్వమన్నాడు (ఇంకో విధంగా
అన్వయిస్తే తన చేతితో ముట్టుకున్నదేదో తనచే ఓడింపబడాలి అంటే తన
స్వంతమవ్వాలి). అటువంటి మురాసురుడు తరవాత దేవతలపైకి దండెత్తి వెళితే
దేవతలందరూ పెద్ద యుద్ధంలేకుండానే పారిపోయారు. అమరావతిని సొంతం చేసుకుని
విలాసాలననుభవిస్తూ తన వాహనంపై లోక సంచారం చేస్తూ భూమిమీదకు వచ్చాడు. భూమి
మీద సరయూ / గంగా తీరంలో రఘుమహారాజు దేవతల కోసం యజ్ఙం చేయటం చూసి కోపగించి
దేవతలకు హవిస్సు ఇవ్వరాదు అని ఆజ్ఙాపించాడు, కూడదంటే తనతో యుద్ధానికి
రమ్మన్నాడు. అంతలో వశిష్టుడు అనునయంగా మాట్లాడి ఈ భూమిపై జీవులనందరినీ యమ
ధర్మరాజు సంహరిస్తుంటాడు కాబట్టి నువ్వు ఆయనతో యుద్ధం చేసి గెలిస్తే అంతా
నీదే అవుతుంది అని చెప్పగా మురుడు యమసదనానికి వెళ్ళాడు. మురుని రాక
గురించి వశిష్థుని ఉపాయం గురించి తెలుసుకున్న యమధర్మరాజు, మురునికి
స్వాగతం చెప్తాడు. మురుడు యముణ్ణి యుద్ధానికి ఆహ్వానిస్తాడు యుద్ధం
వద్దనుకుంటే భూమి మీద ఎవ్వరినీ చంపవద్దని ఆదేశిస్తాడు. అంత యమధర్మ రాజు
మురునితో అలా చేయటానికి తనకి అధికారంలేదనీ చేసినా తన పై అధికారైన
విష్ణువు తనను దండిస్తాడని చెప్పగా మురుడు అదేదో విష్ణువుతోనే
తేల్చుకుంటానని వైకుంఠం వెళ్తాడు. వైకుంఠం లో క్ష్రీర సముద్రం మధ్యలో
విలాసంగా ఆదిశేషుని మీద పడుక్కుని ఉన్న శ్రీ హరితో ఆ మురాసురుడు
యుద్దానికి రమ్మని రంకెవేస్తాడు, జరిగినది తెలుసుకున్న శ్రీహరి ఆ
మురాసురునితో యుద్ధం సరేకానీ నాతో యుద్ధమంటే నీగుండె ఎందుకు అలా భయంతో
కొట్టుకుంటోంది. నాతో యుద్దమంటే నీకు భయంలాగుంది అని అనగానే మురుడు
తత్తరపడి నాకు భయమా ఎవరిగుండె కొట్టుకుంటోంది అని తన చేతిని తన గుండె
మీదపెట్టుకుంటాడు వెంటనే ఆ శ్రీ హరి తన చక్రాయుధంతో మురుని చేతితోసహా
ఖండించి సంహరించాడు.
మురారి అంటే ముర అనే రాక్షసుని చంపినవాడు లేదా శత్రువు అని అర్థం.
మురాసురుడు బ్రహ్మగారి కొరకై తపస్సు చేసి లోకాలన్నీ జయించటంకొరకు తాను
ఎవరినైతే ముట్టు కుంటాడో వారు మరణించేటట్టు వరం ఇవ్వమన్నాడు (ఇంకో విధంగా
అన్వయిస్తే తన చేతితో ముట్టుకున్నదేదో తనచే ఓడింపబడాలి అంటే తన
స్వంతమవ్వాలి). అటువంటి మురాసురుడు తరవాత దేవతలపైకి దండెత్తి వెళితే
దేవతలందరూ పెద్ద యుద్ధంలేకుండానే పారిపోయారు. అమరావతిని సొంతం చేసుకుని
విలాసాలననుభవిస్తూ తన వాహనంపై లోక సంచారం చేస్తూ భూమిమీదకు వచ్చాడు. భూమి
మీద సరయూ / గంగా తీరంలో రఘుమహారాజు దేవతల కోసం యజ్ఙం చేయటం చూసి కోపగించి
దేవతలకు హవిస్సు ఇవ్వరాదు అని ఆజ్ఙాపించాడు, కూడదంటే తనతో యుద్ధానికి
రమ్మన్నాడు. అంతలో వశిష్టుడు అనునయంగా మాట్లాడి ఈ భూమిపై జీవులనందరినీ యమ
ధర్మరాజు సంహరిస్తుంటాడు కాబట్టి నువ్వు ఆయనతో యుద్ధం చేసి గెలిస్తే అంతా
నీదే అవుతుంది అని చెప్పగా మురుడు యమసదనానికి వెళ్ళాడు. మురుని రాక
గురించి వశిష్థుని ఉపాయం గురించి తెలుసుకున్న యమధర్మరాజు, మురునికి
స్వాగతం చెప్తాడు. మురుడు యముణ్ణి యుద్ధానికి ఆహ్వానిస్తాడు యుద్ధం
వద్దనుకుంటే భూమి మీద ఎవ్వరినీ చంపవద్దని ఆదేశిస్తాడు. అంత యమధర్మ రాజు
మురునితో అలా చేయటానికి తనకి అధికారంలేదనీ చేసినా తన పై అధికారైన
విష్ణువు తనను దండిస్తాడని చెప్పగా మురుడు అదేదో విష్ణువుతోనే
తేల్చుకుంటానని వైకుంఠం వెళ్తాడు. వైకుంఠం లో క్ష్రీర సముద్రం మధ్యలో
విలాసంగా ఆదిశేషుని మీద పడుక్కుని ఉన్న శ్రీ హరితో ఆ మురాసురుడు
యుద్దానికి రమ్మని రంకెవేస్తాడు, జరిగినది తెలుసుకున్న శ్రీహరి ఆ
మురాసురునితో యుద్ధం సరేకానీ నాతో యుద్ధమంటే నీగుండె ఎందుకు అలా భయంతో
కొట్టుకుంటోంది. నాతో యుద్దమంటే నీకు భయంలాగుంది అని అనగానే మురుడు
తత్తరపడి నాకు భయమా ఎవరిగుండె కొట్టుకుంటోంది అని తన చేతిని తన గుండె
మీదపెట్టుకుంటాడు వెంటనే ఆ శ్రీ హరి తన చక్రాయుధంతో మురుని చేతితోసహా
ఖండించి సంహరించాడు.
అటువంటి శ్రీహరిని తన సాగరమథనం జరిగినప్పుడు అందులోంచి పైకి వచ్చిన
తల్లివైన నువ్వు చుట్టూ ఎంతమంది ఇతర దేవతలున్నారో రక్కసులున్నారో కూడా
చూడకుండా ముగ్దలా అమాయకురాలిలా ఆ మురాసురుని సంహరించిన ఆ శ్రీ హరి ఈయనే
అని కన్నార్పకుండా మోహంతో చూసిన చూపులు మాకు సిరిసంపదలు కటాక్షించుగాక.
అలా చూస్తున్న చూపులు అందరూ చూస్తున్నారని గ్రహించి , కలువ మీద మళ్ళీ
మళ్ళీ వచ్చి చేరే ఆడ తుమ్మెద లాగా, నీ చూపులను మరల్చి మరల్చి, తిప్పి
తిప్పి, ప్రేమ+సిగ్గు ల దొంతరలతో శ్రీ మహావిష్ణువును ముగ్ద మోహనంగా
చూపులున్న ఓ తల్లీ లక్ష్మీ దేవీ మమ్ములను నీ చల్లని చూపులు
అనుగ్రహించుగాక!
తల్లివైన నువ్వు చుట్టూ ఎంతమంది ఇతర దేవతలున్నారో రక్కసులున్నారో కూడా
చూడకుండా ముగ్దలా అమాయకురాలిలా ఆ మురాసురుని సంహరించిన ఆ శ్రీ హరి ఈయనే
అని కన్నార్పకుండా మోహంతో చూసిన చూపులు మాకు సిరిసంపదలు కటాక్షించుగాక.
అలా చూస్తున్న చూపులు అందరూ చూస్తున్నారని గ్రహించి , కలువ మీద మళ్ళీ
మళ్ళీ వచ్చి చేరే ఆడ తుమ్మెద లాగా, నీ చూపులను మరల్చి మరల్చి, తిప్పి
తిప్పి, ప్రేమ+సిగ్గు ల దొంతరలతో శ్రీ మహావిష్ణువును ముగ్ద మోహనంగా
చూపులున్న ఓ తల్లీ లక్ష్మీ దేవీ మమ్ములను నీ చల్లని చూపులు
అనుగ్రహించుగాక!
సందర్భం:
మురాసురుడంటే ఎవ్వరికీ పెట్టకుండా అంతా తనదే అని దాచుకునేవాడు. అటువంటి
పాపగుణాన్ని ఎవ్వరికీ పెట్టక అంతా నాది నేను అన్న చేయితో సహా శ్రీహరి
నిర్మూలించాడు. పూర్వజన్మలో ఒకరికి పెట్టకనే కదా ఈ జన్మలో ఈ బ్రాహ్మణ
కుటుంబం దరిద్రం అనుభవిస్తోంది ఆ దానం చేయని పాపాన్ని శ్రీహరి
నిర్మూలించగలడు తల్లీ అని అంతర్లీనంగా మురాసురుని సంహార వృత్తాంతం
సంకేతించారు.
మురాసురుడంటే ఎవ్వరికీ పెట్టకుండా అంతా తనదే అని దాచుకునేవాడు. అటువంటి
పాపగుణాన్ని ఎవ్వరికీ పెట్టక అంతా నాది నేను అన్న చేయితో సహా శ్రీహరి
నిర్మూలించాడు. పూర్వజన్మలో ఒకరికి పెట్టకనే కదా ఈ జన్మలో ఈ బ్రాహ్మణ
కుటుంబం దరిద్రం అనుభవిస్తోంది ఆ దానం చేయని పాపాన్ని శ్రీహరి
నిర్మూలించగలడు తల్లీ అని అంతర్లీనంగా మురాసురుని సంహార వృత్తాంతం
సంకేతించారు.
శ్లో3!! విశ్వామరేంద్ర పద విభ్రమ దానదక్ష
మానంద హేతురధికం మురవిద్విషోపి !
ఈషన్నిషీదతుమయి క్షణమీక్షణార్థ
మిన్దీవరోదర సహోదర మిన్దిరాయాః!!
తా : ఇంద్రాది దేవతలకు ముల్లోకములను అమరావతిని కట్టబెట్టగలిగిన దయతో
కూడిన విష్ణుభగవానుని ఆనందమును వృద్ధిచేయు చూపులు కలిగిన తల్లీ, చతుర్ముఖ
బ్రహ్మకి సోదరీ ! ఒక్క క్షణము నీ కరుణాపూరిత చూడ్కులు మాపై
ప్రసారముచేయుదువుగాక!
మానంద హేతురధికం మురవిద్విషోపి !
ఈషన్నిషీదతుమయి క్షణమీక్షణార్థ
మిన్దీవరోదర సహోదర మిన్దిరాయాః!!
తా : ఇంద్రాది దేవతలకు ముల్లోకములను అమరావతిని కట్టబెట్టగలిగిన దయతో
కూడిన విష్ణుభగవానుని ఆనందమును వృద్ధిచేయు చూపులు కలిగిన తల్లీ, చతుర్ముఖ
బ్రహ్మకి సోదరీ ! ఒక్క క్షణము నీ కరుణాపూరిత చూడ్కులు మాపై
ప్రసారముచేయుదువుగాక!
వివరణ: ఇక్కడ కూడా విష్ణుమూర్తిని పరోక్షంగా మురారి అని మురవిద్విషోపి
అన్న పద ప్రయోగం ద్వారా సంబోధించారు శంకరులు. దానము చేయకుండా తనదిగా
అన్నీ దాచుకున్నవానికి శత్రువైన శ్రీమహావిష్ణువు దేవాంద్రాదులకు
స్వర్గాది లోకములను తన దయతో దానమిచ్చాడు. ఇది ఎప్పుడు జరిగింది ఎలా
జరిగింది అని చూస్తే. ఒకానొకనాడు దుర్వాసో మహర్షి అమ్మవారిచ్చిన పుష్ప
హారాన్ని చేత బట్టుకుని వెళ్తూండగా దేవేంద్రుడు ఐరావతం మీద ఎదురైనప్పుడు
దేవేంద్రునికి మంగళం చెప్పి ఆశీర్వదించి దుర్వాసో మహాముని ఇంద్రునికి
అమ్మవారిచ్చిన పుష్పహారాన్ని ఇచ్చారు. తరవాత అహంకారంతో ఉన్న దేవేంద్రుడు
ఆ హారాన్ని ఐరావతం మీదకి విసిరి వెళ్ళిపోయాడు. తద్దోషంగా లక్ష్మీ దేవి
పాల సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఇంద్రుని అహంకారం వల్ల లక్ష్మీ దేవి
దేవలోకాన్నే కాక వైకుంఠాన్ని కూడా వదిలి పాల సముద్రంలో చేరిపోయింది.
తరవాత ఇంద్రుడు అన్ని బాధలు పడ్డాడు, తరవాత క్షీర సాగర మథనం జరిగి
లక్ష్మీ దేవి పైకి వచ్చి శ్రీ మహావిష్ణువుని మళ్ళీ చేరింది(ప్రకటంగా
చేరింది, వారిద్దరూ విడివడినదెన్నడు గనక?). అటువంటి అహంకారి, నీ
ప్రసాదమైన పుష్పమాలనే తిరస్కరించినవాడు రాజ్య భ్రష్టుడౌతే, స్వయంగా శ్రీ
మహావిష్ణువే ఇంద్రునికి తమ్ముడుగా, పన్నెండు నెలలు గర్భవాసం చేసి
వామనావతారమెత్తి, ఇంద్రునికి తమ్ముడు కనుక ఉపేంద్రుడను పేరు పెట్టుకుని,
ఒకరికి ఇవ్వడమే ఎరిగిన శ్రీహరి, బలి చక్రవర్తి వద్ద చేయిచాచి దానమడిగి
మూడులోకాలనూ కొలిచి బలిని పాతాళానికి త్రొక్కి అలా దానంగా సంపాదించిన
రాజ్యాన్ని ఇంద్రునికిచ్చాడు. అటువంటి విష్ణుమూర్తి గుండెలలో ఉండేదానివి
నీవు. నీ చల్లని చూపులతో అంత దయగలిగిన విష్ణుమూర్తికే ఎంతో ఆనందాన్ని
కలిగించేదానవు.
విష్ణు మూర్తి నల్లని కలువ పువ్వైతే అందులోని సౌకుమార్యం అంతా ఆయన దయ.
దాని మధ్యలోనున్న దుద్దు అతి సుకుమారం మధ్య భాగం ప్రకాశవంతం ఇంకా చల్లన.
చల్లని నల్లని విష్ణుమూర్తి అనే కలువ పువ్వుగుండెలోని అత్యంత
సౌకుమార్యమైన అత్యంత చల్లనైన మధ్య భాగం వంటి లక్ష్మీ దేవివినువ్వు.
పువ్వుకన్నా మధ్యభాగంలోనే ఆర్ద్రత, చల్లదనం ఎక్కువ. మరి ఆ చల్లని
చూడ్కులు మాపై ప్రసారం చేసి మమ్మల్ని రక్షించవా తల్లీ!
అన్న పద ప్రయోగం ద్వారా సంబోధించారు శంకరులు. దానము చేయకుండా తనదిగా
అన్నీ దాచుకున్నవానికి శత్రువైన శ్రీమహావిష్ణువు దేవాంద్రాదులకు
స్వర్గాది లోకములను తన దయతో దానమిచ్చాడు. ఇది ఎప్పుడు జరిగింది ఎలా
జరిగింది అని చూస్తే. ఒకానొకనాడు దుర్వాసో మహర్షి అమ్మవారిచ్చిన పుష్ప
హారాన్ని చేత బట్టుకుని వెళ్తూండగా దేవేంద్రుడు ఐరావతం మీద ఎదురైనప్పుడు
దేవేంద్రునికి మంగళం చెప్పి ఆశీర్వదించి దుర్వాసో మహాముని ఇంద్రునికి
అమ్మవారిచ్చిన పుష్పహారాన్ని ఇచ్చారు. తరవాత అహంకారంతో ఉన్న దేవేంద్రుడు
ఆ హారాన్ని ఐరావతం మీదకి విసిరి వెళ్ళిపోయాడు. తద్దోషంగా లక్ష్మీ దేవి
పాల సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఇంద్రుని అహంకారం వల్ల లక్ష్మీ దేవి
దేవలోకాన్నే కాక వైకుంఠాన్ని కూడా వదిలి పాల సముద్రంలో చేరిపోయింది.
తరవాత ఇంద్రుడు అన్ని బాధలు పడ్డాడు, తరవాత క్షీర సాగర మథనం జరిగి
లక్ష్మీ దేవి పైకి వచ్చి శ్రీ మహావిష్ణువుని మళ్ళీ చేరింది(ప్రకటంగా
చేరింది, వారిద్దరూ విడివడినదెన్నడు గనక?). అటువంటి అహంకారి, నీ
ప్రసాదమైన పుష్పమాలనే తిరస్కరించినవాడు రాజ్య భ్రష్టుడౌతే, స్వయంగా శ్రీ
మహావిష్ణువే ఇంద్రునికి తమ్ముడుగా, పన్నెండు నెలలు గర్భవాసం చేసి
వామనావతారమెత్తి, ఇంద్రునికి తమ్ముడు కనుక ఉపేంద్రుడను పేరు పెట్టుకుని,
ఒకరికి ఇవ్వడమే ఎరిగిన శ్రీహరి, బలి చక్రవర్తి వద్ద చేయిచాచి దానమడిగి
మూడులోకాలనూ కొలిచి బలిని పాతాళానికి త్రొక్కి అలా దానంగా సంపాదించిన
రాజ్యాన్ని ఇంద్రునికిచ్చాడు. అటువంటి విష్ణుమూర్తి గుండెలలో ఉండేదానివి
నీవు. నీ చల్లని చూపులతో అంత దయగలిగిన విష్ణుమూర్తికే ఎంతో ఆనందాన్ని
కలిగించేదానవు.
విష్ణు మూర్తి నల్లని కలువ పువ్వైతే అందులోని సౌకుమార్యం అంతా ఆయన దయ.
దాని మధ్యలోనున్న దుద్దు అతి సుకుమారం మధ్య భాగం ప్రకాశవంతం ఇంకా చల్లన.
చల్లని నల్లని విష్ణుమూర్తి అనే కలువ పువ్వుగుండెలోని అత్యంత
సౌకుమార్యమైన అత్యంత చల్లనైన మధ్య భాగం వంటి లక్ష్మీ దేవివినువ్వు.
పువ్వుకన్నా మధ్యభాగంలోనే ఆర్ద్రత, చల్లదనం ఎక్కువ. మరి ఆ చల్లని
చూడ్కులు మాపై ప్రసారం చేసి మమ్మల్ని రక్షించవా తల్లీ!
సందర్భం ప్రకారం: క్రిందటి శ్లోకంలో చేప్పినట్లు దానం చేయనివారికి
శత్రువైన విష్ణుమూర్తి (మురారి), స్వయంగా తానే ఇంద్రునికోసం దానం పట్టి,
తద్వారా వచ్చిన దాన్ని ఇంద్రునికి దానమిచ్చేశాడు. శ్రీ హరిగా పాపాలను
తీయగలడు కానీ దారిద్రాన్ని తీసి పుణ్యఫలంగా ఐశ్వర్యాన్ని ఇవ్వగలడు
అన్నదానికి ఉదాహరణగా పైన చెప్పిన దుర్వాసో మహర్షి, అమ్మవారిచ్చిన పూమాల,
ఇంద్రుడు, క్షీరసాగర మథనం, వామన, బలి చక్రవర్తి కథ మొదలైనవి సూచించారు.
అంటే భగవంతుని, భాగవతుల పట్ల చేసిన తప్పునే దిద్ది తిరిగి ఐశ్వర్యాన్ని
రాజ్యాన్ని ఇవ్వగల దయ కలిగిన హృదయం కలిగినవాడు శ్రీ మహావిష్ణువు. ఆ
చల్లని విష్ణువు గుండెలలో ఇంకా చల్లగా ఉన్న తల్లివి నువ్వు, ఎంతో దయగల మీ
ఇద్దరూ,ఈ బ్రాహ్మణ కుటుంబం యొక్క పాపాలను తీసి వీరిని ఉద్దరించి
ఐశ్వర్యాన్ని కలుగచేయవలసినది అని శంకరులు ప్రార్థించారు.
శత్రువైన విష్ణుమూర్తి (మురారి), స్వయంగా తానే ఇంద్రునికోసం దానం పట్టి,
తద్వారా వచ్చిన దాన్ని ఇంద్రునికి దానమిచ్చేశాడు. శ్రీ హరిగా పాపాలను
తీయగలడు కానీ దారిద్రాన్ని తీసి పుణ్యఫలంగా ఐశ్వర్యాన్ని ఇవ్వగలడు
అన్నదానికి ఉదాహరణగా పైన చెప్పిన దుర్వాసో మహర్షి, అమ్మవారిచ్చిన పూమాల,
ఇంద్రుడు, క్షీరసాగర మథనం, వామన, బలి చక్రవర్తి కథ మొదలైనవి సూచించారు.
అంటే భగవంతుని, భాగవతుల పట్ల చేసిన తప్పునే దిద్ది తిరిగి ఐశ్వర్యాన్ని
రాజ్యాన్ని ఇవ్వగల దయ కలిగిన హృదయం కలిగినవాడు శ్రీ మహావిష్ణువు. ఆ
చల్లని విష్ణువు గుండెలలో ఇంకా చల్లగా ఉన్న తల్లివి నువ్వు, ఎంతో దయగల మీ
ఇద్దరూ,ఈ బ్రాహ్మణ కుటుంబం యొక్క పాపాలను తీసి వీరిని ఉద్దరించి
ఐశ్వర్యాన్ని కలుగచేయవలసినది అని శంకరులు ప్రార్థించారు.
శ్లో4!! ఆమీలితాక్ష మధిగమ్య ముదా ముకున్ద
మానన్దకన్ద మనిమేష మనఙ్గతన్త్రమ్ !
ఆకేకర స్థిర కనినీక పద్మనేత్రం
భూత్యైభవేన్మమ భుజఙ్గశయాఙ్గనాయాః !!
మానన్దకన్ద మనిమేష మనఙ్గతన్త్రమ్ !
ఆకేకర స్థిర కనినీక పద్మనేత్రం
భూత్యైభవేన్మమ భుజఙ్గశయాఙ్గనాయాః !!
తా:ఆమ్మా లక్ష్మీదేవీ! ఎప్పుడూ ఆనందమునిస్తూ కొద్ది కొద్దిగా తెరచియున్న
కన్నులున్నవాడు, మన్మథుని తంత్రమును వశము చేసుకొనినవాడు, ఆదిశేషునిపై
శయనించువాడు ఐన మహావిష్ణువు యొక్క పత్నివి నీవు. అర్థనిమ్మీలిత నేత్రాలతో
స్థిరమైన చూపులతో పద్మము వంటి కనులతో శ్రీ మహావిష్ణువును చూచే
చూడ్కులున్న తల్లీ మీ ఈ కళ్యాణ రూపము నాకు కళ్యాణ రూపము నాకు కళ్యాణమును
కలిగించు గాక.
కన్నులున్నవాడు, మన్మథుని తంత్రమును వశము చేసుకొనినవాడు, ఆదిశేషునిపై
శయనించువాడు ఐన మహావిష్ణువు యొక్క పత్నివి నీవు. అర్థనిమ్మీలిత నేత్రాలతో
స్థిరమైన చూపులతో పద్మము వంటి కనులతో శ్రీ మహావిష్ణువును చూచే
చూడ్కులున్న తల్లీ మీ ఈ కళ్యాణ రూపము నాకు కళ్యాణ రూపము నాకు కళ్యాణమును
కలిగించు గాక.
వివరణ: ఇక్కడ శంకరులు ముకున్ద అన్న పదంతో శ్రీ మహావిష్ణువుని
సంబోధించారు. ముకున్ద అన్న పదానికి మోక్షమునిచ్చువాడు అని అర్థము. ఏ
సంసార బాధలు లేక కేవలము మోక్షమును కోరే వారు ఆశ్రయించు వాడు శ్రీ
మహావిష్ణువు. తాను ఎల్లప్పుడూ అర్థ నిమ్మీలిత నేత్రాలతో తన భక్తులను
రక్షిస్తూ వారికి ఆనందము కలిగించేవాడు శ్రీ మహావిష్ణువు. ఐతే ఆ శ్రీ
మహావిష్ణువు మన్మథుని తంత్రాన్ని వశము చేసుకున్నవాడు అని ఈ శ్లోకంలో
చెప్పారు, అసలు మన్మథుడు ఆయన కొడుకే కదా, ఆ మన్మథునికి ఉన్న శక్తికి కూడా
కారణం ఆ విష్ణువే. ఇక ఆయన భుజగశయనుడు, పాము మీద పడుక్కుంటాడు. ఈ రెంటి
అర్థం ఏమంటే జనన మరణాలకై అతీతంగా మోక్షాన్ని ఇవ్వగలిగినవాడు. మన్మథుడు
పుట్టుకకు కారకుడు, మన్మథ బాణం తగిలితేనే కదా జీవుల జననం సంభవిస్తుంది.
పాము మృత్యువునకు సంకేతం, పాము కాటు వేసిందంటే మృత్యువు గ్రసించినట్టు
అని అర్థం. మరి శ్రీ మహావిష్ణువో, అందరి పుట్టుకకీ కారణమౌతున్న
మన్మథుణ్ణే కన్నవాడు, మృత్యువును తన తల్పంగా కలిగినవాడు, అంటే తన
అవసరానికి ఆసనంగా, తల్పంగా వాడుకునేవాడు. అంటే ఈ రెంటికి అతీతుడు. మరి
మోక్షాన్ని ఇచ్చి కామాన్ని, మరణాన్ని శాసించగలవాడు అలాగే తన భక్తులనీ
కాపాడుకో గలిగినవాడు. (ఇక్కడ శ్రీ హరిని పరబ్రహ్మ తత్త్వంగా సృష్టి,
స్థితి, లయలను ఆధీనములో కలవానిగా కీర్తించారు శంకరులు). అటువంటి శ్రీ
హరిని పద్మములవంటి తన కళ్ళతో కనుపాప కదలకుండా స్థిరమైన చూపులతో సగము
మూసిన కనులతో చూచి మన్మథ తన్త్రాన్నే వశము చేసుకున్న శ్రీ మహావీష్ణువుకు
ఆనందము కలిగించు చూపులున్న తల్లీ ఆ మీ కళ్యాణ కారకమైన చూపులు మాకు కూడా
కళ్యాణమును కలిగించు గాక! అని ప్రార్థించారు.
సంబోధించారు. ముకున్ద అన్న పదానికి మోక్షమునిచ్చువాడు అని అర్థము. ఏ
సంసార బాధలు లేక కేవలము మోక్షమును కోరే వారు ఆశ్రయించు వాడు శ్రీ
మహావిష్ణువు. తాను ఎల్లప్పుడూ అర్థ నిమ్మీలిత నేత్రాలతో తన భక్తులను
రక్షిస్తూ వారికి ఆనందము కలిగించేవాడు శ్రీ మహావిష్ణువు. ఐతే ఆ శ్రీ
మహావిష్ణువు మన్మథుని తంత్రాన్ని వశము చేసుకున్నవాడు అని ఈ శ్లోకంలో
చెప్పారు, అసలు మన్మథుడు ఆయన కొడుకే కదా, ఆ మన్మథునికి ఉన్న శక్తికి కూడా
కారణం ఆ విష్ణువే. ఇక ఆయన భుజగశయనుడు, పాము మీద పడుక్కుంటాడు. ఈ రెంటి
అర్థం ఏమంటే జనన మరణాలకై అతీతంగా మోక్షాన్ని ఇవ్వగలిగినవాడు. మన్మథుడు
పుట్టుకకు కారకుడు, మన్మథ బాణం తగిలితేనే కదా జీవుల జననం సంభవిస్తుంది.
పాము మృత్యువునకు సంకేతం, పాము కాటు వేసిందంటే మృత్యువు గ్రసించినట్టు
అని అర్థం. మరి శ్రీ మహావిష్ణువో, అందరి పుట్టుకకీ కారణమౌతున్న
మన్మథుణ్ణే కన్నవాడు, మృత్యువును తన తల్పంగా కలిగినవాడు, అంటే తన
అవసరానికి ఆసనంగా, తల్పంగా వాడుకునేవాడు. అంటే ఈ రెంటికి అతీతుడు. మరి
మోక్షాన్ని ఇచ్చి కామాన్ని, మరణాన్ని శాసించగలవాడు అలాగే తన భక్తులనీ
కాపాడుకో గలిగినవాడు. (ఇక్కడ శ్రీ హరిని పరబ్రహ్మ తత్త్వంగా సృష్టి,
స్థితి, లయలను ఆధీనములో కలవానిగా కీర్తించారు శంకరులు). అటువంటి శ్రీ
హరిని పద్మములవంటి తన కళ్ళతో కనుపాప కదలకుండా స్థిరమైన చూపులతో సగము
మూసిన కనులతో చూచి మన్మథ తన్త్రాన్నే వశము చేసుకున్న శ్రీ మహావీష్ణువుకు
ఆనందము కలిగించు చూపులున్న తల్లీ ఆ మీ కళ్యాణ కారకమైన చూపులు మాకు కూడా
కళ్యాణమును కలిగించు గాక! అని ప్రార్థించారు.
సందర్భం ప్రకారం: అమ్మా లక్ష్మీ దేవీ! ఈ పేద బ్రాహ్మణ కుటుంబానికి
ఏపుణ్యమూ లేదు అని కాదా నీవు ఐశ్వర్యమివ్వడానికి కుదరదన్నావు. సరే,
నువ్వు స్వయంగా జనన మరణాలకు అతీతంగా ఉండి తన భక్తులను రక్షించే శ్రీ
మహావిష్ణువుకి ఇల్లాలివి. వీరేమో ఏకాదశీ వ్రతం చేసి ద్వాదశి పారణ విధిగా
చేస్తున్నవారు. మరి శ్రీ మహావిష్ణువు తన భక్తులు రక్షించే గుణమున్నవాడు.
ఆయనకి ఎప్పుడూ ఆనందం కలిగించేదానవు నువ్వు, మన్మథుని పుట్టుంచిన ఆయనకే
ఆనందం కలిగించే నీ చూపులు, ఒక్క సారి ఈ బీద బ్రాహ్మణ కుటుంబం మీద పడితే
దాని వల్ల వారు ఉద్దరింపబడితే, శ్రీ మహావిష్ణువు నీ చూపుల ద్వారా తన
భక్తులు ఉద్ధరింపబడ్డారని ఇంకా ఆనందం పొందగలడు. తల్లీ ఆ మీ చల్లని కళ్యాణ
కారకమైన చూపులచే మాకందరికీ కళ్యాణమగు గాక!
ఏపుణ్యమూ లేదు అని కాదా నీవు ఐశ్వర్యమివ్వడానికి కుదరదన్నావు. సరే,
నువ్వు స్వయంగా జనన మరణాలకు అతీతంగా ఉండి తన భక్తులను రక్షించే శ్రీ
మహావిష్ణువుకి ఇల్లాలివి. వీరేమో ఏకాదశీ వ్రతం చేసి ద్వాదశి పారణ విధిగా
చేస్తున్నవారు. మరి శ్రీ మహావిష్ణువు తన భక్తులు రక్షించే గుణమున్నవాడు.
ఆయనకి ఎప్పుడూ ఆనందం కలిగించేదానవు నువ్వు, మన్మథుని పుట్టుంచిన ఆయనకే
ఆనందం కలిగించే నీ చూపులు, ఒక్క సారి ఈ బీద బ్రాహ్మణ కుటుంబం మీద పడితే
దాని వల్ల వారు ఉద్దరింపబడితే, శ్రీ మహావిష్ణువు నీ చూపుల ద్వారా తన
భక్తులు ఉద్ధరింపబడ్డారని ఇంకా ఆనందం పొందగలడు. తల్లీ ఆ మీ చల్లని కళ్యాణ
కారకమైన చూపులచే మాకందరికీ కళ్యాణమగు గాక!
శ్లో5!! కాలాంబుదాళి లలితోరసి కైటభారేర్
ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ !
మాతస్ సమస్త జగతామ్ మహనీయ మూర్తిర్
భద్రాణి మే దిశతు భార్గవ నందనాయా: !!
తా : మబ్బు మధ్యలో మెఱయు మెఱుపు వలె విష్ణుమూర్తి యొక్క నీలమేఘ సన్నిభమైన
వక్ష:స్థలమునందు విలసిల్లు మహనీయ మూర్తి, సకల జగన్మాత, శ్రీ మహాలక్ష్మీ
భగవతి నాకు సమస్త శుభములను గూర్చు గాక !
ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ !
మాతస్ సమస్త జగతామ్ మహనీయ మూర్తిర్
భద్రాణి మే దిశతు భార్గవ నందనాయా: !!
తా : మబ్బు మధ్యలో మెఱయు మెఱుపు వలె విష్ణుమూర్తి యొక్క నీలమేఘ సన్నిభమైన
వక్ష:స్థలమునందు విలసిల్లు మహనీయ మూర్తి, సకల జగన్మాత, శ్రీ మహాలక్ష్మీ
భగవతి నాకు సమస్త శుభములను గూర్చు గాక !
వివరణ: శంకరులు ఇక్కడ శ్రీ హరిని కైటభారే అని సంబోధించారు, ఇక కైటభారే
అన్న విషయానికొస్తే, మధు కైటభులనే రాక్షసులను శ్రీ మహావిష్ణువు సృష్టి
ఆరంభంలో సంహరించారు. మధు కైటభులు ఇద్దరూ సోదరులు, వారెవరో కాదు,
మధువు=నేను; కైటభుడు=నాది అనే గుణాలు. నాది అనేటప్పటికి మనం మన చేతులను
గుండెలమీదపెట్టి నాది అంటాం. అటువంటి గుణానికి ప్రతినిధి ఐన కైటభుని
సంహరించినవాడు శ్రీ హరి. అంటే అటువంటి గుణమునకు శత్రువు అని అంతర్లీనంగా
కైటభ వృత్తాంతాన్ని పొందు పరిచారు శంకరులు.
అంతేకాక కాలాంబుదాళి అన్న పద ప్రయోగం ద్వారా భగవంతుని కురవడానికి
సిద్దంగా ఉన్న నల్లనిమేఘంతో పోలిక వేశారు. శ్రీహరిని నీల మేఘ శ్యాముడని
పిలుస్తారు, కురవడానికి సిద్దముగా ఉన్న మేఘం, మీన మేషాలు లెక్కపెట్టదు,
ఎవరున్నారు ఎవరు లేరు చూడదు, దాహార్తి తో ఉన్నవాడు ఒక్కడే ఉన్నాడు కదా ఆ
ఒక్కడికే కురుద్దామని మేఘము ఆలోచించదు. ఒక్కపెట్టున తన దగ్గరున్నదంతా
కురిసేసి వెళ్ళిపోతుంది. అటువంటి శ్రీహరి లలితమైన హృదయం కలవాడు.
కారుణ్యమనే నీటితో నిండిన ఈ నల్ల మబ్బు గుండెలో దాక్కుని ఒక్కసారిగా
స్ఫురించిన మెరుపు తీగ/ తటిల్లత/ బంగారు తీగ శ్రీ మహాలక్ష్మి. మెరుపు
తీగతో కూడిన నల్లని మబ్బులు జనులందరకూ ఆహ్లాదకారకములెలాగో, అలా ఒకరిలో
ఒకరైన మీ ఇద్దరి దర్శనము మాకు భద్రము చేయుగాక. అమ్మా మెరుపు తీగ
స్వరూపమైన నువ్వు ఒక్కసారి మాపై దయతో మెరిసి కనిపిస్తే, ఆ మెరుపులో మేఘ
స్వరూపమైన భగవంతుని చూపించే కారుణ్యమున్న దానవు (అంటే అమ్మ దయ ఉంటే
అయ్యవారి దర్శనం చేయిస్తుంది అన్న భావన, భగవంతుని సౌందర్య దర్శనము
చేయించినది అమ్మ. అంతేకదా!). అమ్మా నువ్వు అందరకూ తల్లివి కదా మరి
అమ్మవైన నువ్వు ఇలా కష్టపడుతున్న బీద బ్రాహ్మణ కుటుంబాన్ని
ఉద్దరించాలికదా. అమ్మా అంత కారుణ్యమున్న భగవంతుని గుండెలలో ఉన్న దానవు
నువ్వు. అమ్మా ఆ భగవంతుని కారుణ్యము, ఔదార్యము నువ్వే కదా. అలా వీరిని
ఉద్దరించగలిగిన శక్తిగా ఆయన గుండెలలో ఉన్నది నువ్వే కదమ్మా!
అన్న విషయానికొస్తే, మధు కైటభులనే రాక్షసులను శ్రీ మహావిష్ణువు సృష్టి
ఆరంభంలో సంహరించారు. మధు కైటభులు ఇద్దరూ సోదరులు, వారెవరో కాదు,
మధువు=నేను; కైటభుడు=నాది అనే గుణాలు. నాది అనేటప్పటికి మనం మన చేతులను
గుండెలమీదపెట్టి నాది అంటాం. అటువంటి గుణానికి ప్రతినిధి ఐన కైటభుని
సంహరించినవాడు శ్రీ హరి. అంటే అటువంటి గుణమునకు శత్రువు అని అంతర్లీనంగా
కైటభ వృత్తాంతాన్ని పొందు పరిచారు శంకరులు.
అంతేకాక కాలాంబుదాళి అన్న పద ప్రయోగం ద్వారా భగవంతుని కురవడానికి
సిద్దంగా ఉన్న నల్లనిమేఘంతో పోలిక వేశారు. శ్రీహరిని నీల మేఘ శ్యాముడని
పిలుస్తారు, కురవడానికి సిద్దముగా ఉన్న మేఘం, మీన మేషాలు లెక్కపెట్టదు,
ఎవరున్నారు ఎవరు లేరు చూడదు, దాహార్తి తో ఉన్నవాడు ఒక్కడే ఉన్నాడు కదా ఆ
ఒక్కడికే కురుద్దామని మేఘము ఆలోచించదు. ఒక్కపెట్టున తన దగ్గరున్నదంతా
కురిసేసి వెళ్ళిపోతుంది. అటువంటి శ్రీహరి లలితమైన హృదయం కలవాడు.
కారుణ్యమనే నీటితో నిండిన ఈ నల్ల మబ్బు గుండెలో దాక్కుని ఒక్కసారిగా
స్ఫురించిన మెరుపు తీగ/ తటిల్లత/ బంగారు తీగ శ్రీ మహాలక్ష్మి. మెరుపు
తీగతో కూడిన నల్లని మబ్బులు జనులందరకూ ఆహ్లాదకారకములెలాగో, అలా ఒకరిలో
ఒకరైన మీ ఇద్దరి దర్శనము మాకు భద్రము చేయుగాక. అమ్మా మెరుపు తీగ
స్వరూపమైన నువ్వు ఒక్కసారి మాపై దయతో మెరిసి కనిపిస్తే, ఆ మెరుపులో మేఘ
స్వరూపమైన భగవంతుని చూపించే కారుణ్యమున్న దానవు (అంటే అమ్మ దయ ఉంటే
అయ్యవారి దర్శనం చేయిస్తుంది అన్న భావన, భగవంతుని సౌందర్య దర్శనము
చేయించినది అమ్మ. అంతేకదా!). అమ్మా నువ్వు అందరకూ తల్లివి కదా మరి
అమ్మవైన నువ్వు ఇలా కష్టపడుతున్న బీద బ్రాహ్మణ కుటుంబాన్ని
ఉద్దరించాలికదా. అమ్మా అంత కారుణ్యమున్న భగవంతుని గుండెలలో ఉన్న దానవు
నువ్వు. అమ్మా ఆ భగవంతుని కారుణ్యము, ఔదార్యము నువ్వే కదా. అలా వీరిని
ఉద్దరించగలిగిన శక్తిగా ఆయన గుండెలలో ఉన్నది నువ్వే కదమ్మా!
సందర్భం
పూర్వ జన్మలలోఅలా నాది నాది అని గుండెలమీదనే చెయ్యిపెట్టుకుని చెయ్యిని
తిరగేసి దాన ధర్మాలు చేయలేదు కనకనే బీద బ్రాహ్మణ కుటుంబానికి ఇప్పుడు
దరిద్రం ఉన్నది అటువంటి దరిద్రాన్ని తొలగతోసే మేఘ స్వరూపమైన భగవంతుని
కారుణ్యం ఇక్కడ కురవాలంటే భగవంతుని దర్శనం చేయించగలిగి, ఆయన గుండెలలో
ఉండే నువ్వు ఒక్క సారి కారుణ్యాన్ని వర్షింపజేయి. ఈ బీదబ్రాహ్మణి
అమ్మతనంతో నాకు ప్రేమతో ఒక అమ్మలా భిక్ష వేసింది. అమ్మ తనానికే పరాకాష్ట
నువ్వు. అన్ని జగములకూ అమ్మవు నువ్వు. అమ్మా మరి ఆ అమ్మ ఇచ్చిన భిక్షను
నేను సంతోషం తో స్వీకరించాలంటే మరి ఈ అమ్మ కష్టాన్ని తీయలేవా. ఎంత
కారుణ్యముంటే నువ్వు భృగుమహర్షికి కూతురిలాపుట్టావు తల్లీ. అంత
కారుణ్యమున్న మీరిరువురూ ఒక్కసారి కారుణ్యామృత చూపులు ఒక్కసారి మెరుపు
మెరిసినట్టుగా ప్రసరిస్తే వీరి దారిద్ర్యం తొలగిపోతుంది.
పూర్వ జన్మలలోఅలా నాది నాది అని గుండెలమీదనే చెయ్యిపెట్టుకుని చెయ్యిని
తిరగేసి దాన ధర్మాలు చేయలేదు కనకనే బీద బ్రాహ్మణ కుటుంబానికి ఇప్పుడు
దరిద్రం ఉన్నది అటువంటి దరిద్రాన్ని తొలగతోసే మేఘ స్వరూపమైన భగవంతుని
కారుణ్యం ఇక్కడ కురవాలంటే భగవంతుని దర్శనం చేయించగలిగి, ఆయన గుండెలలో
ఉండే నువ్వు ఒక్క సారి కారుణ్యాన్ని వర్షింపజేయి. ఈ బీదబ్రాహ్మణి
అమ్మతనంతో నాకు ప్రేమతో ఒక అమ్మలా భిక్ష వేసింది. అమ్మ తనానికే పరాకాష్ట
నువ్వు. అన్ని జగములకూ అమ్మవు నువ్వు. అమ్మా మరి ఆ అమ్మ ఇచ్చిన భిక్షను
నేను సంతోషం తో స్వీకరించాలంటే మరి ఈ అమ్మ కష్టాన్ని తీయలేవా. ఎంత
కారుణ్యముంటే నువ్వు భృగుమహర్షికి కూతురిలాపుట్టావు తల్లీ. అంత
కారుణ్యమున్న మీరిరువురూ ఒక్కసారి కారుణ్యామృత చూపులు ఒక్కసారి మెరుపు
మెరిసినట్టుగా ప్రసరిస్తే వీరి దారిద్ర్యం తొలగిపోతుంది.
శ్లో6!! బాహ్యాంతరే మధుజిత: శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరినీలమయీ విభాతి !
కామప్రదా భగవతో౭పి కటాక్ష మాలా
కల్యాణ మావహతు మే కమలాలయాయా: !!
తా : శ్రీ మహావిష్ణువు యొక్క వక్ష: స్థలమునందలి కౌస్తుభ మణి నాశ్రయించి
దాని లోపల, వెలుపల కూడ ఇంద్రనీల మణిహారములవంటి ఓరచూపులను ప్రసరింప జేయుచు
కోరికలను తీర్చు లక్ష్మీదేవి నాకు శ్రేయస్సును చేకూర్చు గాక !
హారావళీవ హరినీలమయీ విభాతి !
కామప్రదా భగవతో౭పి కటాక్ష మాలా
కల్యాణ మావహతు మే కమలాలయాయా: !!
తా : శ్రీ మహావిష్ణువు యొక్క వక్ష: స్థలమునందలి కౌస్తుభ మణి నాశ్రయించి
దాని లోపల, వెలుపల కూడ ఇంద్రనీల మణిహారములవంటి ఓరచూపులను ప్రసరింప జేయుచు
కోరికలను తీర్చు లక్ష్మీదేవి నాకు శ్రేయస్సును చేకూర్చు గాక !
వివరణ: శ్రీ శంకరులు ఈ శ్లోకంలో శ్రీ హరిని మధుజితః అన్న నామంతో
సంబోధించారు. పై శ్లోకంలో వివరించినట్లు మధువు=నేను; కైటభుడు=నాది అనే
గుణాలు. ముందు నాది అనే భ్రాంతిని తొలగతోసి తరవాత నేను అనే అహంకారాన్ని
తొలగతోయగలడు శ్రీ హరి అన్న అర్థాన్ని స్ఫురించేలా ముందు శ్లోకంలో కైటభారే
అని తరవాత శ్లోకంలో మధుజిత్ అన్న నామాన్ని వాడారు. నేను నాది అన్న భావన
పోయిననాడు మనిషికి పాప కర్మలు చేయవలసిన పని ఉండదు, నేను నాది అన్న భావన
తొలగుతే అంతా పరబ్రహ్మమును చూస్తూ ఆత్మగా మిగిలిపోయి, తన పక్కవారి బాధను
తనదిగా తలచి వారికి వలసిన దాన ధర్మాలు సహాయాలు చేయగలడు. మధు కైటభులను
సంహరించిన శ్రీమహావిష్ణువు వక్షస్థలమందు అమ్మ లక్ష్మీదేవి కొలువై ఉండి తన
చూపులను ప్రసారం చేయగా ఆ చూపులు ఆయన హృదయంలోనూ, బయట ఉన్న కౌస్తుభమణికి
గొప్పనైన ప్రకాశముని ఇవ్వగలిగిన చూపులు ఆ చూపులు. తనతోపాటు సముద్రములో
పుట్టునదే ఐనా ఆ కౌస్తుభమణి కాంతులు ఆ అమ్మ చూపుల కాంతి వల్లనే
ప్రకాశిస్తున్నాయి అన్న అర్థం కూడా అన్వయమయ్యేటట్టు తల్లి లక్ష్మీదేవిని
"కమలాలయాయాః" అని సంబోధించారు. ఆ విష్ణువక్షస్థలవాసిని ఐన ఆ తల్లి నల్లని
చల్లని చూపులు విష్ణు భగవానుని గుండెలపై వేసిన ఇంద్రనీలమణుల హారములవలె
ఉన్నాయి. అటువంటి చల్లని చూపులు మాకు శ్రేయస్సునుచేకూర్చుగాక.
సంబోధించారు. పై శ్లోకంలో వివరించినట్లు మధువు=నేను; కైటభుడు=నాది అనే
గుణాలు. ముందు నాది అనే భ్రాంతిని తొలగతోసి తరవాత నేను అనే అహంకారాన్ని
తొలగతోయగలడు శ్రీ హరి అన్న అర్థాన్ని స్ఫురించేలా ముందు శ్లోకంలో కైటభారే
అని తరవాత శ్లోకంలో మధుజిత్ అన్న నామాన్ని వాడారు. నేను నాది అన్న భావన
పోయిననాడు మనిషికి పాప కర్మలు చేయవలసిన పని ఉండదు, నేను నాది అన్న భావన
తొలగుతే అంతా పరబ్రహ్మమును చూస్తూ ఆత్మగా మిగిలిపోయి, తన పక్కవారి బాధను
తనదిగా తలచి వారికి వలసిన దాన ధర్మాలు సహాయాలు చేయగలడు. మధు కైటభులను
సంహరించిన శ్రీమహావిష్ణువు వక్షస్థలమందు అమ్మ లక్ష్మీదేవి కొలువై ఉండి తన
చూపులను ప్రసారం చేయగా ఆ చూపులు ఆయన హృదయంలోనూ, బయట ఉన్న కౌస్తుభమణికి
గొప్పనైన ప్రకాశముని ఇవ్వగలిగిన చూపులు ఆ చూపులు. తనతోపాటు సముద్రములో
పుట్టునదే ఐనా ఆ కౌస్తుభమణి కాంతులు ఆ అమ్మ చూపుల కాంతి వల్లనే
ప్రకాశిస్తున్నాయి అన్న అర్థం కూడా అన్వయమయ్యేటట్టు తల్లి లక్ష్మీదేవిని
"కమలాలయాయాః" అని సంబోధించారు. ఆ విష్ణువక్షస్థలవాసిని ఐన ఆ తల్లి నల్లని
చల్లని చూపులు విష్ణు భగవానుని గుండెలపై వేసిన ఇంద్రనీలమణుల హారములవలె
ఉన్నాయి. అటువంటి చల్లని చూపులు మాకు శ్రేయస్సునుచేకూర్చుగాక.
సందర్భం ప్రకారం: అమ్మా స్వయంగా శ్రీ విష్ణుభగవానుని కోర్కెలే తీర్చగల
శక్తివి నీవు, విష్ణుభగవానుడు ఇతరుల కోర్కెలు తీరుస్తున్నాడూ అంటే దానికి
మూల శక్తివి నువ్వెకదమ్మా! నేను నాది అన్న భావంతోటే పోయినజన్మలో చేసిన
పుణ్యం లేక ఇప్పుడు దరిద్రం అనుభవిస్తున్నారు ఈ బీద బ్రాహ్మణులు.
అందరికోర్కెలు తీర్చే విష్ణుభగవానునికి ఆ కోర్కెలుతీర్చేశక్తిగా ఉన్నది
నువ్వేకదమ్మా ఆయన గుండెలలో. అటువంటి మీ చూపులు ఒక్కసారి వీరి మీద
ప్రసరిస్తే ఆ చూపులు వారికి శ్రేయస్సును కలిగిస్తాయి అని శంకరులు
ప్రార్థించారు.
శక్తివి నీవు, విష్ణుభగవానుడు ఇతరుల కోర్కెలు తీరుస్తున్నాడూ అంటే దానికి
మూల శక్తివి నువ్వెకదమ్మా! నేను నాది అన్న భావంతోటే పోయినజన్మలో చేసిన
పుణ్యం లేక ఇప్పుడు దరిద్రం అనుభవిస్తున్నారు ఈ బీద బ్రాహ్మణులు.
అందరికోర్కెలు తీర్చే విష్ణుభగవానునికి ఆ కోర్కెలుతీర్చేశక్తిగా ఉన్నది
నువ్వేకదమ్మా ఆయన గుండెలలో. అటువంటి మీ చూపులు ఒక్కసారి వీరి మీద
ప్రసరిస్తే ఆ చూపులు వారికి శ్రేయస్సును కలిగిస్తాయి అని శంకరులు
ప్రార్థించారు.
శ్లో7!! ప్రాప్తమ్ పదమ్ ప్రథమత: ఖలు యత్ ప్రభావాత్
మాంగల్య భాజి మధుమర్దిని మన్మథేన !
మయ్యాపతేత్ తదిహ మంథర మీక్షణార్ధమ్
మందాలసం చ మకరాలయ కన్యకాయా: !!
తా : దేని ప్రభావముచేత మన్మథుఁడు సమస్త కల్యాణ గుణాభిరాముఁడైన శ్రీ
విష్ణుమూర్తి యొక్క మనస్సునందు (ఆయనను మన్మథబాధకు గుఱిచేయుట ద్వారా)
మొదటి సారిగా స్థానము సంపాదించుకొన్నాడో, ఆ లక్ష్మీదేవి యొక్క నెమ్మదైన
మఱియు ప్రసన్నమైన ఓరచూపు నా మీద ప్రసరించు గాక !
మాంగల్య భాజి మధుమర్దిని మన్మథేన !
మయ్యాపతేత్ తదిహ మంథర మీక్షణార్ధమ్
మందాలసం చ మకరాలయ కన్యకాయా: !!
తా : దేని ప్రభావముచేత మన్మథుఁడు సమస్త కల్యాణ గుణాభిరాముఁడైన శ్రీ
విష్ణుమూర్తి యొక్క మనస్సునందు (ఆయనను మన్మథబాధకు గుఱిచేయుట ద్వారా)
మొదటి సారిగా స్థానము సంపాదించుకొన్నాడో, ఆ లక్ష్మీదేవి యొక్క నెమ్మదైన
మఱియు ప్రసన్నమైన ఓరచూపు నా మీద ప్రసరించు గాక !
వివరణ: ఈ శ్లోకంలో కూడా శంకరులు మధుమర్దిని అన్న పదాన్ని విష్ణువుకు
వాడారు, ఆంతరంగా అమ్మవారికీ ఈ పదాన్ని వాడారు. అలా ఎలా అంటే, మధు
కైటభులను శ్రీహరి సంహరించినప్పుడు జగజ్జనని మధు కైటభులను మోహపరచడానికి
(కామప్రదమైన) తన చూపులను మధుకైటభులపై ప్రసరింపజేయగా దానితో విర్రవీగిన ఆ
రాక్షసులు విష్ణువుకే వరం ఇవ్వడానికి సిద్దపడగా విష్ణువు వారి చావునే
వరంగా కోరాడు అలా ఆ తల్లి తన చూపులతో మొట్టమొదటి రాక్షస సంహారంగా తన
చూపులతో విష్ణువును అనుగ్రహించి అందరికీ అన్నీ ఈయగల విష్ణువుకు మధుకైటభ
సంహారం అనే కోరిక తీర్చినది. దీనిద్వారా మధుమర్దిని అన్న నామం
శ్రీమహావిష్ణువుకు అమ్మవారికీ కూడా చెందుతుంది. ఏ అమ్మవారి చూపుల
ప్రభావంచేత మధుకైటభులు మోహాంధులై సంహరింపబడ్డారో, ఏ చూపుల వలన మధువనే
రాక్షసుని చంపే మంగళకార్యం శ్రీహరి చేయగలిగెనో, అటువంటి చూపులు కలిగిన
తల్లి లక్ష్మీ దేవి (ఇక్కడ లక్ష్మీదేవిని ఆదిశక్తిగా శంకరులు
కొలుస్తున్నారు) విష్ణుభగవానుని హృదయమనే స్థానాన్ని అలంకరించినట్టి
లక్ష్మీదేవి, నిర్హేతుకంగా మొసళ్ళు మొదలగు కౄర ప్రాణులు నివసించు
సముద్రుని కరుణించి కూతురుగా పుట్టిన తల్లి లక్శ్మీదేవి తన నెమ్మదైన,
కరుణాపూరితమైన నిమ్మీలిత నేత్ర దృష్టిని మాపై ప్రసారం చేయుగాక.
వాడారు, ఆంతరంగా అమ్మవారికీ ఈ పదాన్ని వాడారు. అలా ఎలా అంటే, మధు
కైటభులను శ్రీహరి సంహరించినప్పుడు జగజ్జనని మధు కైటభులను మోహపరచడానికి
(కామప్రదమైన) తన చూపులను మధుకైటభులపై ప్రసరింపజేయగా దానితో విర్రవీగిన ఆ
రాక్షసులు విష్ణువుకే వరం ఇవ్వడానికి సిద్దపడగా విష్ణువు వారి చావునే
వరంగా కోరాడు అలా ఆ తల్లి తన చూపులతో మొట్టమొదటి రాక్షస సంహారంగా తన
చూపులతో విష్ణువును అనుగ్రహించి అందరికీ అన్నీ ఈయగల విష్ణువుకు మధుకైటభ
సంహారం అనే కోరిక తీర్చినది. దీనిద్వారా మధుమర్దిని అన్న నామం
శ్రీమహావిష్ణువుకు అమ్మవారికీ కూడా చెందుతుంది. ఏ అమ్మవారి చూపుల
ప్రభావంచేత మధుకైటభులు మోహాంధులై సంహరింపబడ్డారో, ఏ చూపుల వలన మధువనే
రాక్షసుని చంపే మంగళకార్యం శ్రీహరి చేయగలిగెనో, అటువంటి చూపులు కలిగిన
తల్లి లక్ష్మీ దేవి (ఇక్కడ లక్ష్మీదేవిని ఆదిశక్తిగా శంకరులు
కొలుస్తున్నారు) విష్ణుభగవానుని హృదయమనే స్థానాన్ని అలంకరించినట్టి
లక్ష్మీదేవి, నిర్హేతుకంగా మొసళ్ళు మొదలగు కౄర ప్రాణులు నివసించు
సముద్రుని కరుణించి కూతురుగా పుట్టిన తల్లి లక్శ్మీదేవి తన నెమ్మదైన,
కరుణాపూరితమైన నిమ్మీలిత నేత్ర దృష్టిని మాపై ప్రసారం చేయుగాక.
సందర్భం ప్రకారం: అమ్మా లక్ష్మీదేవీ, ఏ కారణముందని నీ కరుణతో తనలో ఎన్నో
కౄరప్రాణులని ఉంచి పోషిస్తున్న సముద్రునికి కూతురువయ్యి లక్ష్మీదేవి
తండ్రి అని సముద్రునికి కీర్తినిచ్చావు? అది నీ అపార దయ కారుణ్యం, అది
నిర్హేతుకము. అలాగే అదే కారుణ్యముతోటి ఈ బీద బ్రాహ్మణ కుటుంబాన్ని
ఉద్దరించవా. అమ్మా నీ మోహపు చూపుల ప్రభావంచేతనేకదా మధువనే రాక్షసుని వధ
అనే మంగళ కార్యమును శ్రీమహావిష్ణువు నిర్వర్తించినాడు. ఒకేసారి నీ
చూడ్కులు రాక్షసులు సంహరింపబడడానికి, శ్రీమహావిష్ణువు రాక్షస సంహారమనే
మంగళకార్యముచేయడానికి హేతువులైనాయి కదా. మరి ఈ బీద బ్రాహ్మణ కుటుంబానికి
ఏ హేతువులేక ఐశ్వర్యాన్ని ఇవ్వలేకపోతే, నీచూపులను ప్రసారించి అవే
హేతువులుగా చూపి ఐశ్వర్యాన్ని కటాక్షించు తల్లీ. అందరికోర్కెలు తీర్చే
విష్ణుభగవానుని కోర్కెలే తీర్చగలిగిన నీచూపులు దరిద్రులైన వీరిని
ఉద్దరించగలవు. కాబట్టి నీ కరుణాపూరితమైన చూపులను మాపైన వర్షింపజెయి.
కౄరప్రాణులని ఉంచి పోషిస్తున్న సముద్రునికి కూతురువయ్యి లక్ష్మీదేవి
తండ్రి అని సముద్రునికి కీర్తినిచ్చావు? అది నీ అపార దయ కారుణ్యం, అది
నిర్హేతుకము. అలాగే అదే కారుణ్యముతోటి ఈ బీద బ్రాహ్మణ కుటుంబాన్ని
ఉద్దరించవా. అమ్మా నీ మోహపు చూపుల ప్రభావంచేతనేకదా మధువనే రాక్షసుని వధ
అనే మంగళ కార్యమును శ్రీమహావిష్ణువు నిర్వర్తించినాడు. ఒకేసారి నీ
చూడ్కులు రాక్షసులు సంహరింపబడడానికి, శ్రీమహావిష్ణువు రాక్షస సంహారమనే
మంగళకార్యముచేయడానికి హేతువులైనాయి కదా. మరి ఈ బీద బ్రాహ్మణ కుటుంబానికి
ఏ హేతువులేక ఐశ్వర్యాన్ని ఇవ్వలేకపోతే, నీచూపులను ప్రసారించి అవే
హేతువులుగా చూపి ఐశ్వర్యాన్ని కటాక్షించు తల్లీ. అందరికోర్కెలు తీర్చే
విష్ణుభగవానుని కోర్కెలే తీర్చగలిగిన నీచూపులు దరిద్రులైన వీరిని
ఉద్దరించగలవు. కాబట్టి నీ కరుణాపూరితమైన చూపులను మాపైన వర్షింపజెయి.
శ్లో8!! దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా
మస్మిన్నకించన విహంగ శిశౌ విషణ్ణే !
దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహ: !!
తా : లక్ష్మీదేవి యొక్క నీలమేఘముల వంటి నల్లని కనులు, ఈ దరిద్రుఁడనెడి
విచారగ్రస్త పక్షి పిల్లపై దయ అనెడి చల్లని గాలితో కూడుకొని వీచి, ఈ
దారిద్ర్యమునకు కారణమైన పూర్వజన్మల పాపకర్మలను శాశ్వతముగా, దూరముగా
తొలగద్రోసి, నా మీద ధనమనెడి వానసోనలను ధారాళముగా కురియించు గాక !
మస్మిన్నకించన విహంగ శిశౌ విషణ్ణే !
దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహ: !!
తా : లక్ష్మీదేవి యొక్క నీలమేఘముల వంటి నల్లని కనులు, ఈ దరిద్రుఁడనెడి
విచారగ్రస్త పక్షి పిల్లపై దయ అనెడి చల్లని గాలితో కూడుకొని వీచి, ఈ
దారిద్ర్యమునకు కారణమైన పూర్వజన్మల పాపకర్మలను శాశ్వతముగా, దూరముగా
తొలగద్రోసి, నా మీద ధనమనెడి వానసోనలను ధారాళముగా కురియించు గాక !
విశేషార్థము : "అకించన" అన్న పదానికి 'దరిద్రుడు' అని, 'పాపములు
లేనివాడు' అని రెండర్థాలు.
లేనివాడు' అని రెండర్థాలు.
వివరణ: ఇక్కడ శ్రీ హరిని నారాయణ అన్న నామంతో అమ్మవారిని నారాయణ ప్రణయినీ
అన్న నామంతో సంబోధించారు శంకరులు. నారాయణ అన్న పదానికి నీటికయ్య లేదు
పుష్కలమైన నీరుఉన్న ప్రదేశము ఇల్లుగా కలవాడు అని అర్థముకూడాఉన్నది.
(సమస్త జీవజాలమూ విశ్రాంతి తీసుకొను ప్రదేశము అన్న అర్థముకూడా ఉన్నది).
నీరు ఎక్కువగా కావలసినది బాగా తాపము, దాహమున్నవారికి. ఆ నీటినే ఇల్లుగా
చేసుకున్నవాడు విష్ణుభగవానుడు. మరినువ్వో ఆ విష్ణుభగవానుని పత్నివి.
నీకన్నులనిండా కారుణ్యము ఆర్ద్రత అనే నీటిమేఘాన్ని కలిగి ఉన్నదానివి.
అమ్మా మేఘాలు ఏంచేస్తాయమ్మా, భరింపరాని గ్రీష్మతాపాన్ని పోగొడతాయి. అమ్మా
గ్రీష్మ తాపంతో అల్లాడుతున్న పక్షిపిల్లకు కలిగే వేడిని దయ అనే చూపులతో
తొలగతోసి, విషాదంలో మునిగిఉన్న ఈ పక్షికి నీ కన్నులనిండా నల్లగా ఉన్న
మేఘమనే కరుణార్ద్ర చూపులను ప్రసరించి కారుణ్యాన్ని వర్షించి తాపాన్ని
తీర్చమ్మా.
అన్న నామంతో సంబోధించారు శంకరులు. నారాయణ అన్న పదానికి నీటికయ్య లేదు
పుష్కలమైన నీరుఉన్న ప్రదేశము ఇల్లుగా కలవాడు అని అర్థముకూడాఉన్నది.
(సమస్త జీవజాలమూ విశ్రాంతి తీసుకొను ప్రదేశము అన్న అర్థముకూడా ఉన్నది).
నీరు ఎక్కువగా కావలసినది బాగా తాపము, దాహమున్నవారికి. ఆ నీటినే ఇల్లుగా
చేసుకున్నవాడు విష్ణుభగవానుడు. మరినువ్వో ఆ విష్ణుభగవానుని పత్నివి.
నీకన్నులనిండా కారుణ్యము ఆర్ద్రత అనే నీటిమేఘాన్ని కలిగి ఉన్నదానివి.
అమ్మా మేఘాలు ఏంచేస్తాయమ్మా, భరింపరాని గ్రీష్మతాపాన్ని పోగొడతాయి. అమ్మా
గ్రీష్మ తాపంతో అల్లాడుతున్న పక్షిపిల్లకు కలిగే వేడిని దయ అనే చూపులతో
తొలగతోసి, విషాదంలో మునిగిఉన్న ఈ పక్షికి నీ కన్నులనిండా నల్లగా ఉన్న
మేఘమనే కరుణార్ద్ర చూపులను ప్రసరించి కారుణ్యాన్ని వర్షించి తాపాన్ని
తీర్చమ్మా.
సందర్భం ప్రకారం:
విహంగ శిశౌ అనే అర్థంతో పక్షిపిల్ల అన్న అర్థంతోపాటు, బ్రాహ్మణులు అన్న
అర్థం కూడా వస్తుంది. పక్షి గుడ్డుగా ఒకసారి పిల్లగా ఒకసారి జన్మిస్తుంది
కాబట్టి ద్విజ అని అంటారు. అలానే బ్రాహ్మణులకి కూడా ఉపనయనం అయ్యినతరవాత
ద్విజ అని సంబోధిస్తారు. కాబట్టి విహంగ శిశౌ అని అన్నప్పుడు ఈ
బ్రాహ్మణులకి అన్న అర్థం కూడా అన్వయమౌతుంది. తాపంతో ఉన్నవారికి
నీరిస్తే సరిపోతుంది కదా మళ్ళీ దయ అనే చూపులతో వేడిని తీయడమెందుకు? అంటే
ఇప్పుడు తాపం తొలగుతుంది మళ్ళీవేడి పుట్టినప్పుడు మళ్ళీ తాపం పుడుతుంది.
అమ్మా ఇప్పుడు వీరికి కావలసిన ఐశ్వర్యమే కాదు, ఇప్పటిదాకా
ఐశ్వర్యంపొందకుండా అడ్డుగా ఉన్న పాపాలని నీవు దయతో తొలగతోయలేదా, నువ్వు
ఐశ్వర్యమిచ్చినా వారి పూర్వ పాపం వల్ల అది భ్రష్టమౌతుంది. కాబట్టి తల్లీ
వారి పూర్వజన్మ పాపాలని తీసి కురియడానికి సిద్దంగా ఉన్న నీకళ్ళనే మేఘాలని
వారిపై వర్షించు. మరి పాపాలంటే తీస్తాను కాని ఇవ్వడానికి పుణ్యమేదీ అని
అంటావేమో! ఇదిగో నాకు దానం చేసిన ఉసిరికాయ ఇంకా నాచేతిలోనే ఉంది
అదేసాక్ష్యం. దయ అనేసముద్రాన్ని ఇల్లుగా చేసుకున్నవాడు నారాయణుడు, అతని
పత్నివైన నీవో ఆ దయనే కళ్ళల్లో, కారుణ్యాన్నే చూపుల్లో పెట్టుకున్నదానివి
నువ్వు. మీ చల్లని చూపులు మాదారిద్రమనే తాపాన్ని, పూర్వజన్మపాపాలను
పోగొట్టుగాక.
విహంగ శిశౌ అనే అర్థంతో పక్షిపిల్ల అన్న అర్థంతోపాటు, బ్రాహ్మణులు అన్న
అర్థం కూడా వస్తుంది. పక్షి గుడ్డుగా ఒకసారి పిల్లగా ఒకసారి జన్మిస్తుంది
కాబట్టి ద్విజ అని అంటారు. అలానే బ్రాహ్మణులకి కూడా ఉపనయనం అయ్యినతరవాత
ద్విజ అని సంబోధిస్తారు. కాబట్టి విహంగ శిశౌ అని అన్నప్పుడు ఈ
బ్రాహ్మణులకి అన్న అర్థం కూడా అన్వయమౌతుంది. తాపంతో ఉన్నవారికి
నీరిస్తే సరిపోతుంది కదా మళ్ళీ దయ అనే చూపులతో వేడిని తీయడమెందుకు? అంటే
ఇప్పుడు తాపం తొలగుతుంది మళ్ళీవేడి పుట్టినప్పుడు మళ్ళీ తాపం పుడుతుంది.
అమ్మా ఇప్పుడు వీరికి కావలసిన ఐశ్వర్యమే కాదు, ఇప్పటిదాకా
ఐశ్వర్యంపొందకుండా అడ్డుగా ఉన్న పాపాలని నీవు దయతో తొలగతోయలేదా, నువ్వు
ఐశ్వర్యమిచ్చినా వారి పూర్వ పాపం వల్ల అది భ్రష్టమౌతుంది. కాబట్టి తల్లీ
వారి పూర్వజన్మ పాపాలని తీసి కురియడానికి సిద్దంగా ఉన్న నీకళ్ళనే మేఘాలని
వారిపై వర్షించు. మరి పాపాలంటే తీస్తాను కాని ఇవ్వడానికి పుణ్యమేదీ అని
అంటావేమో! ఇదిగో నాకు దానం చేసిన ఉసిరికాయ ఇంకా నాచేతిలోనే ఉంది
అదేసాక్ష్యం. దయ అనేసముద్రాన్ని ఇల్లుగా చేసుకున్నవాడు నారాయణుడు, అతని
పత్నివైన నీవో ఆ దయనే కళ్ళల్లో, కారుణ్యాన్నే చూపుల్లో పెట్టుకున్నదానివి
నువ్వు. మీ చల్లని చూపులు మాదారిద్రమనే తాపాన్ని, పూర్వజన్మపాపాలను
పోగొట్టుగాక.
శ్లో9!! ఇష్టాః విశిష్ట మతయో౭పి నరా యయా౭౭
దయార్ద్ర దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభన్తే!
దృష్టి: ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టామ్
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయా: !!
తా : ఎవరు కరుణార్ద్ర దృష్టితో చూచినచో ఆశ్రితులైన పండితులు (జ్ఞానులు)
తేలికగా స్వర్గధామమున సుఖించెదరో, విష్ణుమూర్తినే అలరించునట్టి వెలుగుతో
విలసిల్లు ఆ కమలాసనురాలైన లక్ష్మీదేవి నాకు కావలసిన విధముగా సంపన్నతను
పొనరించు గాక !
దయార్ద్ర దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభన్తే!
దృష్టి: ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టామ్
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయా: !!
తా : ఎవరు కరుణార్ద్ర దృష్టితో చూచినచో ఆశ్రితులైన పండితులు (జ్ఞానులు)
తేలికగా స్వర్గధామమున సుఖించెదరో, విష్ణుమూర్తినే అలరించునట్టి వెలుగుతో
విలసిల్లు ఆ కమలాసనురాలైన లక్ష్మీదేవి నాకు కావలసిన విధముగా సంపన్నతను
పొనరించు గాక !
వివరణ: ఈస్తొత్రంలో బాల శంకరులు అమ్మవారిని లక్ష్మీ దేవిగానే కాక
ముగురమ్మలుగా కీర్తిస్తున్నారు, ఎవరి చల్లని కంటి చూపువలన మానవులు వాంఛా
ఫలత్వము, గొప్పనైన బుద్ధి మరియు జ్ఙానమును పొంది అంత్యమున స్వర్గాది
లోకములను మోక్షమును పొందుతున్నారో ఆ చూపులకు కారణమైనటువంటి బాగుగా
విప్పారినటువంటి కమలముల లాంటి అందమైన కళ్ళు కలిగిన ( బాగా విప్పారిన
కమలము మధ్యలో చల్ల దనము, తడి బిందువులు ఉంటాయి, అంటే అమ్మవారి కన్నిలు
బాగా విప్పారి భక్తుల ఆర్తి తీర్చడానికి తడి ఉన్న కన్నులు అని
చెప్పటానికి ఈ ఉపమానం వేశారు శంకరులు), పద్మము పై విరాజిల్లిన
లక్ష్మీదేవి యొక్క ఆ చల్లని కృపాదృష్టి మా అందరిపై వర్షించు గాక.
ముగురమ్మలుగా కీర్తిస్తున్నారు, ఎవరి చల్లని కంటి చూపువలన మానవులు వాంఛా
ఫలత్వము, గొప్పనైన బుద్ధి మరియు జ్ఙానమును పొంది అంత్యమున స్వర్గాది
లోకములను మోక్షమును పొందుతున్నారో ఆ చూపులకు కారణమైనటువంటి బాగుగా
విప్పారినటువంటి కమలముల లాంటి అందమైన కళ్ళు కలిగిన ( బాగా విప్పారిన
కమలము మధ్యలో చల్ల దనము, తడి బిందువులు ఉంటాయి, అంటే అమ్మవారి కన్నిలు
బాగా విప్పారి భక్తుల ఆర్తి తీర్చడానికి తడి ఉన్న కన్నులు అని
చెప్పటానికి ఈ ఉపమానం వేశారు శంకరులు), పద్మము పై విరాజిల్లిన
లక్ష్మీదేవి యొక్క ఆ చల్లని కృపాదృష్టి మా అందరిపై వర్షించు గాక.
సందర్భం ప్రకారం: అమ్మా నువ్వు ఈ బీద బ్రాహ్మణ కుటుంబం ఆర్తిని
తీర్చలేనిదానవుగాదు. నిన్ను ఆశ్రయించిన వారికి కేవలం ఐశ్వర్యమే కాదు సకల
కోరికలు తీర్చగలవు, జ్ఙానమియ్యగలవు, స్వర్గాదులు మోక్షము ఇయ్యగలవు.
అందుకు ఋజువు లోకంలో ఎందరో పండితులు నిన్ను స్తుతి చేయడమేగదా. అందరికీ
అన్నీ ఈయగల నువ్వు ఈ బీద బ్రాహ్మణ కుటుంబానికి నువ్వు కలిగిన తాపాన్ని
తీయడానికి నీ కృపాపూర్ణ దృక్కులు మాపై ప్రసరించెదవుగాక.
తీర్చలేనిదానవుగాదు. నిన్ను ఆశ్రయించిన వారికి కేవలం ఐశ్వర్యమే కాదు సకల
కోరికలు తీర్చగలవు, జ్ఙానమియ్యగలవు, స్వర్గాదులు మోక్షము ఇయ్యగలవు.
అందుకు ఋజువు లోకంలో ఎందరో పండితులు నిన్ను స్తుతి చేయడమేగదా. అందరికీ
అన్నీ ఈయగల నువ్వు ఈ బీద బ్రాహ్మణ కుటుంబానికి నువ్వు కలిగిన తాపాన్ని
తీయడానికి నీ కృపాపూర్ణ దృక్కులు మాపై ప్రసరించెదవుగాక.
No comments:
Post a Comment